దేశంలో 8 వేలు దాటిన కరోనా కేసులు

38
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 8,329 మందికి కరోనా పాజిటివ్ రాగా 10 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,32,13,435కు చేరగా 4,26,48,308 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 40,370 యాక్టివ్ కేసులుండగా 5,24,757 మంది మృతిచెందారు.

యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.09 శాతానికి చేరగా రికవరీ రేటు 98.69 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,94,92,71,111 మందికి టీకాలు పంపిణీ చేశారు.

- Advertisement -