దేశంలో 97 శాతానికి రికవరీ రేటు..

161
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,111 కొత్త కేసులు నమోదుకాగా 738 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,05,02,362కు చేరగా 2,96,05,779 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,95,533 యాక్టివ్ కేసులు నమోదుకాగా 4,01,050 మంది మృత్యువాతపడ్డారు. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 34,46,11,291 డోసులు పంపిణీ చేయగా రికవరీ రేటు 97.06 శాతానికి పెరిగింది. ఇప్పటి వరకు 41.64 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

- Advertisement -