24 గంటల్లో 9983 కరోనా కేసులు నమోదు..

215
coronavirus
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 9983 పాజిటివ్ కేసులు నమోదుకాగా నిన్న ఒక్కరోజే 206 మంది మృత్యువాత పడ్డారు.

ఇక దేశంలో ఇప్పటివరకు 2,56,611 కేసులు నమోదుకాగా 1,24,095 మంది బాధితులు కోలుకున్నారు. ఈ ప్రాణాంతక వైరస్‌తో 7135 మంది మృత్యువాత పడగా 1,25,381 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో ఆదివారం కొత్తగా 3007 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో చైనాను దాటేసింది మహారాష్ట్ర.

ప్రపంచ వ్యాప్త మృతుల సంఖ్య నాలుగు లక్షలు దాటగా అమెరికాలో 1.10వేల మంది చనిపోయారు. మరణాల్లో అమెరికా, బ్రిటన్‌ తర్వాత మూడో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ ఇక నుంచి వైరస్‌ మృతులు, కొత్తగా నమోదైన కేసుల వివరాలను వెల్లడించడం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -