దేశంలో 24 గంటల్లో 11,610 కరోనా కేసులు…

138
kcr cm
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 11,610 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వంద మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,09,37,320కు పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,36,549 యాక్టివ్ కేసులుండగా ఇప్పటి వరకు 1,06,44,858 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,55,913 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 6,44,931 నమూనాలను పరిశీలించగా ఇప్పటి వరకు 20,79,77,229 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -