దేశంలో 24 గంటల్లో 9,309 కరోనా కేసులు

146
covid
- Advertisement -

దేశంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 9,309 కరోనా కేసులు నమోదవుతుండగా 87 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,80,603కు చేరాయి.

ప్రస్తుతం దేశంలో 1,35,926 యాక్టివ్ కేసులుండగా 1,05,89,230 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1,55,447 మంది మృతిచెందారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.3 శాతంగా ఉంటే మరణాల రేటు 1.4 శాతానికి పడిపోయింది.

- Advertisement -