భారత్‌లో 9 లక్షలు దాటిన కరోనా కేసులు..

187
coronavirus news
- Advertisement -

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 25 వేల వరకు కరోనా కేసులు నమోదవుతుండటంతో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 553 మంది మరణించారు.

కరోనా బాధితుల సంఖ్య 9,06,752కు చేరగా యాక్టివ్ కేసుల సంఖ్య 3,11,565గా ఉంది. ఇప్పటి వరకూ 5,71,460 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం 23,727 మంది కరోనాతో మృతిచెందారు.

ఇక ఇప్పటివరకు 1,20,92,503 శాంపిల్స్‌ టెస్టు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 24 గంటల్లో 2,86,247 మందికి కరోనా పరీక్షలు చేశామని దేశంలో కరోనా రికవరీ రేటు 63.02 శాతంగా ఉందని తెలిపింది.

- Advertisement -