దేశంలో 24 గంటల్లో 32,080 కరోనా కేసులు…

275
india coronavirus cases
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 32,080 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 402 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 3,78,909 యాక్టివ్‌ కేసులు ఉండగా 92,15,581 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు.కరోనాతో ఇప్పటివరకు 1,41,360 మంది మృతిచెందారు.

గత 24 గంటల్లో 10,22,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా డిసెంబర్‌ 8 వరకు మొత్తం 14,98,36,767 నమూనాలను పరీక్షించామని ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -