9 లక్షల 68 వేలకు చేరిన కరోనా కేసులు…

174
corona in karnataka
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువైంది. రోజుకు దాదాపు 30 వేల పాజిటివ్ కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 32,695 పాజిటివ్ కేసులు న‌మోదవ‌గా ఒక్కరోజే 606 మంది మృతిచెందారు.

ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,68,876కు చేరగా 6,12,815 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. 3,31,146 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 24,915 మంది బాధితులు మృతిచెందారు.

జూలై 15 వ‌ర‌కు 1,27,39,490 న‌మూనాల‌ను ప‌రీక్షించగా గత 24 గంటల్లో 3,26,826 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది.

- Advertisement -