24 గంటల్లో 28,701 కరోనా కేసులు…

163
corona in karnataka
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. వారం రోజులుగా రోజుకు 25 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 28,701 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 500 మంది మృతిచెందారు.

ఇక దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 8,78,254కు చేరగా 3,01,609 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 5,53,471 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 23,174 మంది మృతిచెందారు.

నిన్న 2,19,103 కరోనా టెస్టులు నిర్వహించగా ఇప్పటివరకు 1,18,06,256 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది.

- Advertisement -