భారత్‌లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు..

188
corona
- Advertisement -

దేశంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోయింది. గత 24 గంటల్లో 19,148 పాజిటివ్ కేసులు నమోదుకాగా 434 మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు ఆరు లక్షల మార్కును దాటాయి.

ఇప్పటివరకు 6,04,641 కరోనా కేసులు నమోదుకాగా 17834 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడినవారిలో 3,59,860 మంది బాధితులు కోలుకోగా, 2,26,947 మంది చికిత్స పొందుతున్నారు.

జూలై 1వ వరకు 90,56,173 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని నిన్న ఒకేరోజు దేశవ్యాప్తంగా 2,29,588 పరీక్షలు చేశామని వెల్లడించింది ఐసీఎంఆర్.

ఇక ఇప్పటివరకు 213 దేశాలకు కరోనా విస్తరించగా 1,08,03,599 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,18,968 మంది మరణించారు. కరోనా బారినపడినవారిలో 43,45,614 మంది చికిత్స పొందుతుండగా, మరో 64,57,985 మంది కోలుకున్నారు.

- Advertisement -