5 లక్షలు దాటిన కరోనా కేసులు…

208
coronavirus
- Advertisement -

దేశంలో రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధికంగా 18, 552 పాజిటివ్ కేసులు నమోదు కాగా 384 మంది మృతి చెందారు. ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 5, 08, 953కి చేరింది.

ఇప్పటివరకు 2, 95, 880 మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 1,97, 387 మందికి చికిత్స కొనసాగుతోంది. గత నాలుగు వారాల్లోనే 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న మహారాష్ట్రలో ఒక్కరోజే 5వేల మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. ఒక్క మహారాష్ట్రలోనే 1,52,765 మంది కరోనా బాధితులున్నారు.

కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 15685కు పెరిగింది. జూన్‌ 26 వరకు 79,96,707 శాంపిల్స్‌ టెస్ట్‌ చేశారు. ఒక్క శుక్రవారమే 2,20,479 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

- Advertisement -