26 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

193
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు 60 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళనకు గురిచేస్తుండగా కరోనా కేసుల సంఖ్య 26 లక్షలకు చేరువయ్యాయి.

గత 24 గంటల్లో దేశంలో 63,490 కరోనా కేసులు నమోదుకాగా 944 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 25,89,682కి చేరగా 18,62,258 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ప్రస్తుతం దేశంలో 6,77,444 యాక్టివ్ కేసులుండగా 49,980 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో ఇండియాలో 53,322 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

- Advertisement -