దేశంలో 12 లక్షలకు చేరువలో కరోనా కేసులు…

241
ts coronavirus cases
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 37,724 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 648 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11, 92, 915కు చేరగా 28,732 మంది ప్రాణాలు కొల్పోయారు.

దేశంలో యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4, 11, 133కు చేరగా 7, 53, 050 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.

మహారాష్ట్రలో అత్యధికంగా 3,27,031 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12,276 మంది చనిపోయారు. తమిళనాడులో 1,80,643 కేసులు, ఢిల్లీలో 1,25,096 కేసులు, కర్ణాటకలో 71,069, ఆంధ్రప్రదేశ్‌లో 58,668 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -