దేశంలో 24 గంటల్లో 803 మంది మృతి…

156
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో ఒకేరోజు 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 803 మంది ప్రాణాలు కొల్పోయారు.

ఇక దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,55,746కి చేరగా 38,938 మంది ప్రాణాలు కొల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 586298గా ఉండగా 1230510 మంది కరోనా నుండి కోలుకున్నారు.

కరోనా టెస్టుల సంఖ్య రోజురోజుకి పెంచుతున్నామని తెలిపిన ఐసీఎంఆర్…ఇప్పటివరకు 2.09 కోట్ల మందికి టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. గత 24 గంటల్లో అత్యధికంగా 6.62 ల‌క్ష‌ల మందికి టెస్టులు నిర్వహించామని ఐసీఎంఆర్ వెల్లడించింది. మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో రిక‌వ‌రీ కేసుల సంఖ్య పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -