దేశంలో 91 లక్షలు దాటిన కరోనా కేసులు..

142
covid 19
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 91 లక్షలు దాటాయి. గత 24గంటల్లో కొత్తగా 44,059 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 511 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 91,39,866కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 4,43,486 యాక్టివ్ కేసులుండగా 85,62,642 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారితో 1,33,738 మంది మృత్యువాతపడ్డారు.

గత 24 గంటల్లో 8,49,596 కరోనా శాంపిల్స్ టెస్టులు చేయగా ఇప్పటి వరకు 13,25,82,730 టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -