700 దాటిన కరోనా మరణాలు..

219
india corona
- Advertisement -

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 23,077కి చేరుకోగా 718 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 1684 కొత్త కేసులు నమోదుకాగా 37 మంది మృతి చెందారు.

ఇప్పటివరకు కరోనాబారీన పడి 4749 మంది కోలుకున్నారు. ఇక మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే 778 పాజిటివ్ కేసులు నమోదుకాగా మొత్తం కేసులసంఖ్య 6427కి చేరాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో 283 మంది ప్రాణాలు కొల్పోయారు.

ఇక ముంబైలోని మురికివాడ ధారవిలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. ఇప్పటివరకు ఇక్కడ214 కేసులు నమోదుకాగా 13 మంది మృతిచెందారు. ముంబైలో 813 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించగా ప్రజలు కరోనాను ఎదుర్కొనేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు సీఎం ఉద్దవ్ ఠాక్రే.

- Advertisement -