పాక్ రికార్డును తిరగరాసిన భారత్..

225
ind
- Advertisement -

టీ20ల్లో భారత్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇకే ఏడాది అత్యధిక మ్యాచ్‌లు గెలుపొందిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు పాక్ అత్యధికంగా ఒకే ఏడాది 20 టీ20 మ్యాచ్‌లు గెలుపొందగా తాజాగా భారత్ దానికి అధిగమించింది.

21 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాక్ రికార్డును బ్రేక్ చేసింది. 2022ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. సొంత గడ్డ మీద వెస్టిండీస్, శ్రీలంకలను వైట్ వాష్ చేసింది. జూన్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించింది. హార్దిక్ పాండ్య నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా.. ఐర్లాండ్‌ను 2-0 తేడాతో ఓడించింది. జులైలో రోహిత్ సేన ఇంగ్లాండ్‌ గడ్డ మీద 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలుపొందింది.

వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత జట్టు 4-1తో గెలుపొందింది. రోహిత్ ఇప్పటి వరకూ 42 టీ20ల్లో భారత్‌కు నాయకత్వం వహించగా.. 33 మ్యాచ్‌ల్లో జట్టు విజయం సాధించింది.

- Advertisement -