ఆసియా కప్ 2025లో భాగంగా హై ఓల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ విధించిన 128 పరుగుల టార్గెట్ను 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47 నాటౌట్గా నిలవగా తిలక్ వర్మ (31) రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఇక అంతకముందు టాస్ గెలిచి తొలుత పాక్ బ్యాటింగ్కు దిగింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (40) టాప్ స్కోరర్గా నిలిచాడు,షాహీన్ అఫ్రిది (33*; 16 బంతుల్లో 4 సిక్స్లు) చివర్లో రాణించడంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. గేమ్ ఛేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అక్షర్ పటేల్కు వచ్చింది. భారత్ తన తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 19న ఒమన్తో తలపడనుంది.
Also Read:‘మిరాయ్’కి అద్భుత స్పందన

