కివీస్‌పై భారత్ విక్టరీ..

9
- Advertisement -

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ గెలుపొందింది. కివీస్‌ విధించిన 100 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కొల్పోయి 19.5 ఓవర్లలో చేధించింది.ఈ విజయంతో సిరీస్ ను 1-1 తో సమం చేసింది.

లక్ష్యం చిన్నదే అయినా భారత బ్యాట్స్‌మెన్‌లకు చుక్కలు చూపించారు కివీస్ బౌలర్లు. శుభ్ మన్ గిల్ 11, ఇషాన్ కిషన్ 19, రాహుల్ త్రిపాఠి 13, సుందర్ 10, సూర్య కుమార్ యాదవ్ 26*, హార్ధిక్ పాండ్యా 15* రన్స్ చేశారు. ఈ టీ20 మ్యాచ్ లో ఒక్క సిక్స్ కూడా లేకపోవడం గమనార్హం.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి కేవలం 99 పరుగులే చేసింది. మార్క్ చాప్ మన్ 14, మైకేల్ బ్రేస్వెల్ 14, ఫిన్ అలెన్ 11, డెవాన్ కాన్వే 11 పరుగులు చేశారు. ధాటిగా ఆడే గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులకే ఔట్ కాగా, డారిల్ మిచెల్ (8) కూడా విఫలం అయ్యాడు. ఇక కీలకమైన మూడో టీ20 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 1న జరగనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -