- Advertisement -
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20ని కైవసం చేసుకుంది భారత్. భారత్ విధించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 17 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. మోయిన్ అలీ (35; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ విల్లే (33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది.
ఒక అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (29 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు) రాణించగా రోహిత్ శర్మ (31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రిషబ్ పంత్ (26; 4 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు. భువనేశ్వర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఆదివారం నాటింగ్హామ్ వేదికగా ఇరు జట్ల మధ్య చివరి టీ20 జరుగనుంది.
- Advertisement -