- Advertisement -
భక్తికి, త్యాగానికి ప్రతీక భక్రీద్ అన్నారు సీఎం కేసీఆర్. భక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) పండుగ సందర్భంగా ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదని పేర్కొన్నారు.
తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ చాటిచెప్తున్నదని సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని, ముస్లింల విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మైనార్టీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ‘షాదీ ముబారక్’ పథకం ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తున్నదని తెలిపారు.
- Advertisement -