చైనాకు మరో షాకిచ్చిన భారత్..

20
- Advertisement -

చైనాకు మరో షాకిచ్చింది భారత్. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలు యాప్‌లను బ్యాన్ చేసిన భారత్…తాజాగా మరో 232 యాప్‌లపై బ్యాన్ విధించింది. ఇందులో 138 బెట్టింగ్ యాప్‌లు కాగా మరో 94 లోన్ యాప్‌లున్నాయి.

ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత పౌరులకు ఆర్థికంగా నష్టం చేకూర్చేలా, భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించేలా ఆయా మొబైల్‌ యాప్‌లు ఉన్నాయని, అందుకే వాటిపై నిషేధం విధించాలని నిర్ణయించామని తెలిపింది.

కాగా, గతంలో కూడా చైనాకు చెందిన టిక్‌టాక్‌తో సహా పలు యాప్‌లను కేంద్రం నిషేధించింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -