రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై ఆంక్షలు విధించాలని కోరిన ‘అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛా కమిషన్’ (USCIRF) వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, యుఎస్ సంస్థ భారత్పై అనుచిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు. అది ఒక పక్షపాత సంస్థ అని, దాని వెనుక కొన్ని ప్రత్యేక అజెండాలు ఉన్నాయని, దానికి ఎలాంటి విశ్వసనీయత లేనందున ఇటువంటి సంస్థలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. భారత్లోని బహుళత్వ వ్యవస్థను గానీ, విభిన్న సముదాయాల మధ్య ఉన్న సామరస్య పూర్వక జీవనాన్ని గానీ USCIRF గుర్తిస్తుందని తాము భావించడం లేదని తెలిపారు.
ఆగస్టు 29న ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ న్యూయార్క్ పర్యటనకు రానున్న నేపథ్యంలో, ఆయన పర్యటనను అడ్డుకోవాలని మరియు ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించాలని యుఎస్సిఐఆర్ఎఫ్ ఛైర్మన్ ఆసిఫ్ మహమూద్ అమెరికా ప్రభుత్వాన్ని కోరారు. ఆసిఫ్ మహమూద్ పాకిస్థాన్ జన్మభూమిగా గల అమెరికన్ పౌరుడు కావడం, ఆయనకు పాకిస్థాన్ రాజకీయ మరియు దౌత్య నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం గమనార్హం. ఆర్ఎస్ఎస్ నాయకులకు దౌత్యపరమైన మర్యాదలు విస్తరించకూడదని, మత స్వేచ్ఛా ఉల్లంఘనలకు బాధ్యులైన వారిపై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు దృష్టి సారించాలని సదరు సంస్థ పేర్కొంది. ఈ ఏడాది మార్చిలో కూడా భారత్లో మత స్వేచ్ఛ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆర్ఎస్ఎస్ మరియు పరిశోధన-విశ్లేషణ విభాగాన్ని (RAW) లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించాలని యుఎస్సిఐఆర్ఎఫ్ వార్షిక నివేదికలో సిఫార్సు చేసింది.
ఈ వ్యాఖ్యలపై అమెరికాలోని హిందూ హక్కుల ప్రచార సంస్థ ‘హిందూప్యాక్ట్’ తీవ్రంగా స్పందించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ పర్యటనను వ్యతిరేకించడం ద్వారా యుఎస్ కమిషన్ తన పరిమితులను దాటి ప్రవర్తించిందని విమర్శించింది. హిందూప్యాక్ట్ వ్యవస్థాపకుడు అజయ్ షా మాట్లాడుతూ… యుఎస్సిఐఆర్ఎఫ్ ఛైర్మన్ మాటలు ఒక అమెరికన్ కమిషన్ బాధ్యుడిలా కాకుండా, హిందూ వ్యతిరేక కథనాన్ని వ్యాప్తి చేసే ప్రతినిధిలా ఉన్నాయని దుయ్యబట్టారు. మోహన్ భగవత్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హిందూ సంస్థకు నాయకత్వం వహిస్తున్నారని, ఆయన్ను విమర్శించడం సముచితం కాదని పేర్కొన్నారు.
Also Read:హార్ముజ్..అమెరికా భూభాగమే!

