ఇందిరా పార్క్ వద్ద ఇండియా కూటమి ధర్నా

30
- Advertisement -

ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందని తెలిపారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ,మంత్రులు, సీనియర్ నాయకులు ధర్నాలో పాల్గొంటారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మరియ ఇండియా కూటమి పార్టీ ల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు,ధర్నాలు జరగనున్నాయి. పార్లమెంట్ లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి నిరసన తెలుపుతోంది.

పార్లమెంట్ లో 13వ తేదీన ఆగంతకులు చొరబడి పొగ బాంబులు వేసిన అంశంలో హోమ్ మంత్రి పార్లమెంట్ లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఇండియా కూటమి నేతలు. ఇండియా కూటమి పార్లమెంట్ లో ప్రశ్నిస్తే లోక్ సభ, రాజ్యసభ లలో ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అన్ని జిల్లా కేంద్రాలలో ఇండియా కూటమి తో కలిసి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు మహేష్‌ కుమార్ గౌడ్.

Also Read:ఊరు పేరు భైరవకోన..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -