లంక రైతుల కోసం : భారత ప్రభుత్వం

147
modi
- Advertisement -

శ్రీలంక రైతులకు వ్యవసాయ మరియు ఆహార భద్రత కోసం ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడంలో సహాయపడటానికి భారత ప్రభుత్వం ఆదివారం 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందచేసింది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు క్రెడిట్ లైన్ కింద అందచేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది భారత ప్రభుత్వం. గత ఏప్రిల్‌ నెలల్లో శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. గత జూన్‌ నెల వరకు శ్రీలంకకు ఎస్‌ఎల్‌ఆర్‌ కింద భారత్‌ 3 బిలియన్ల (రూ. 65,35,00,000 కంటే ఎక్కువ) కంటే ఎక్కువ విలువైన మానవతా సహాయం చేసింది.

- Advertisement -