భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 13 నుంచి జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్కు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ సిరీస్ కమర్షియల్, గ్లోబల్ మీడియా రైట్స్ సిండికేషన్ బాధ్యతలను పాకిస్థాన్కు చెందిన ‘ట్రాన్స్గ్రూప్’ (TransGroup) అనే సంస్థ దక్కించుకుంది.
లాహోర్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL), పీసీబీలతో ఒప్పందాలు కలిగి ఉంది. ఇప్పుడు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ఈ సిరీస్ కోసం ట్రాన్స్గ్రూప్ను తమ గ్లోబల్ మీడియా రైట్స్ పార్టనర్గా ప్రకటించింది.
ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లు (సెప్టెంబర్ 13, 15, 17) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరగనున్నాయి. అయితే ఈ సిరీస్కు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా హోస్ట్గా వ్యవహరిస్తోంది. అఫ్గాన్లో అంతర్జాతీయ క్రికెట్ వసతుల కొరత కారణంగా వారు భారత్ను తమ హోమ్ గ్రౌండ్గా ఎంచుకున్నారు.
భారత్లోని క్రికెట్ అభిమానుల కోసం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను FanCode సాధించగా, టెలివిజన్ ప్రత్యక్ష ప్రసార హక్కులను Sony Sports Network సొంతం చేసుకుంది. టీపీటీ360 (TPT360) సంస్థ మీడియా ప్రొడక్షన్ పార్టనర్గా వ్యవహరిస్తోంది.
Also Read:MEA:నేపాల్లో గల్లంతైన భారతీయుల లిస్ట్
భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ను అఫ్గాన్ బోర్డు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇటీవల 2026 జూన్లో జరిగిన టెస్టు, వన్డే సిరీస్లలో భారత్ ఘనవిజయం సాధించగా, ఈ టీ20 సిరీస్ రెండు జట్లకు రాబోయే ఆసియా క్రీడలు 2026కు మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది.

