లోయ‌లో ప‌డ్డ బ‌స్సు..33మంది మృతి..

329
bus accident
- Advertisement -

మ‌హారాష్ట్ర‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మ‌హాబ‌లేశ్వ‌ర్ విహార యాత్ర‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాద‌వ శాత్తు ఓ ప్రైవేటు బ‌స్సు లోయ‌లో ప‌డింది. ఈప్ర‌మాదంలో 33మంది అక్కడిక‌క్క‌డే మృతి చెంద‌గా..లోయ‌లో నుంచి 13మంది మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీశారు అధికారులు. 500అడుగ‌ల లోతులో బ‌స్సుప‌డ్డ‌ట్టుగా గుర్తించారు. మృతి చెందిన వారంతా కోంక‌ణ్ యూనివ‌ర్సీటికి చెందిన సిబ్బందిగా గుర్తించారు. మ‌హారాష్ట్ర‌లో స‌త‌రా జిల్లా అంబేన‌లి ఘాట్ లో పొలంద‌పూర్ లో ఈఘ‌ట‌న చోటుచేసుకుంది. మొత్తం బ‌స్సులో 40వ‌ర‌కూ ఉన్న‌ట్లుగా గుర్తించారు. లోయ‌లో ప‌డ్డ మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అధికారులు. గాయ‌పడ్డ వ్య‌క్తుల‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -