త‌ల్లిని ట్రాక్ట‌ర్ కింద ప‌డేసిన‌ క‌సాయి కొడుకు(వీడియో)

208
tractor_washim
- Advertisement -

త‌న‌కు ఎన్ని నొప్పులు వ‌చ్చినా న‌వ మాసాలు మోసి పెంచి పెద్ద చేస్తోంది అమ్మ‌. పుట్ట‌బోయే బిడ్డ క్షేమం కోసం ఎంత‌టి నొప్పుల‌న‌యినా భ‌రిస్తోంది అమ్మ.బిడ్డ క‌డుపు నింపడం కోసం తాను ఎన్నో రోజులు ప‌స్తులుంటుంది అమ్మ‌. అలాంటి అమ్మ‌కు నేటి స‌మాజంలో క‌నీసం ముద్ద అన్నం కూడా పెట్టే కొడుకులు క‌రువ‌యిపోయారు. నేటి స‌మాజంలో ఇంట్లో ప్ర‌శాంతంగా గ‌డ‌పాల్సిన అమ్మ‌లు వృధ్దాశ్ర‌మంలో బాధ‌ప‌డుతూ గ‌డుపుతున్నారు. అలాంటి అమ్మ‌ను నేడు ఆస్తి కోసం కొట్టి, చంపేస్తోన్నారు కొంద‌రు క‌సాయి కొడుకులు.

tractor-mother

త‌న‌కు ఆస్తి ద‌క్క‌లేద‌ని ఎంతో మంది త‌ల్లుల‌ను చిత్ర‌హింస‌లు పెడుతుంటారు. కానీ ఇక్క‌డ జ‌రిగిన సంఘ‌ట‌న చూస్తే ఎవ‌రికైనా భాద అనించ‌క ఉండ‌దు. సొంత త‌ల్లిపైనే క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించాడో కొడుకు. త‌ల్లిఅని ఏమాత్రం క‌నిక‌రం లేకుండా ట్రాక్ట‌ర్ కింద పడేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. మ‌హారాష్ట్ర‌లోని వాసిమ్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

పోలీసులు మీడియాకు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. త‌న బావి ప్ర‌క్క‌న ఉన్న వ్య‌క్తికి అత‌నికి భూత‌గాదాలు ఉన్నాయి. అయితే ఇద్ద‌రూ త‌ర‌చు గొడ‌వ‌లు పెట్టుకోవ‌డంతో వివాదం కోర్టు వ‌ర‌కూ చేరింది. దీంతో అన్ని ప‌రిశీలించిన కోర్టు ఆ భూమిని వేరే అత‌నికి చెందుతుంద‌న్న‌ట్లు తీర్పు ఇచ్చింది. దింతో ఆ భూమి యాజ‌మాని ట్రాక్ట‌ర్ తో దున్నుతుండ‌గా అడ్డుకుని అత‌నితో గొడ‌వ పెట్టుకున్నారు. అక్క‌డే ఉన్న త‌న త‌ల్లిని తీసుకెళ్లి ముందు ఉన్న ట్రాక్ట‌ర్ టైర్ కింద ప‌డేశాడు. ఈ గొడ‌వ‌ను మొత్తం రికార్డు చేశారు అక్కడున్న స్దానికులు. వైర‌ల్ అవుతోన్న ఈ వీడియో లో పలువురు నెటిజ‌న్లు కామెంట్లు చేస్తోన్నారు. క‌న్న త‌ల్లి పైనే ఇంత నీచంగా వ్య‌వ‌హారించిన అత‌నిని వెంట‌నే జైలు కు పంపించి త‌గిన శిక్ష విధించాల‌ని డిమాండ్ చేస్తోన్నారు.

- Advertisement -