IMD:మరో ఐదు రోజులు వర్షాలు

46
- Advertisement -

ఎడతెరపిలేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ చేదు వార్తనందించింది. దేశంలో పలు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని.. గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలోని ఘాట్ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read:ప్రతిరోజూ ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో..!

అలాగే మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజుల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని…ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయలో జులై 25 వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాబోయే మూడురోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని శనివారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపారు.

Also Read:పిక్ టాక్ :మత్తెక్కించే ఫోజులతో మైమరిపించింది

- Advertisement -