మొక్కలు నాటిన IKP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..

169
IKP Madavi
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు రోజు రోజు కి ప్రజాదరణ పొందుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ఐ కె పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి. ఈ సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తనని ఎంతగానో ఆకర్షిచిందని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ఇంచార్జిలా ద్వారా, మరియు గ్రామ స్థాయిలో 18000 ఐ కె పి సెంటర్ లకి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సంక్షిప్త సమాచారం పంపి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని పరిచయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటుతమన్నారు. అలాగే నాటిన మొక్కలు ఎదిగే బాధ్యత తీసుకుంటాం అన్నారు. ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -