రాష్ట్రంలో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ..

150
- Advertisement -

తెలంగాణలో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగులోని ఓ/ఓ డీన్ టీఎఫ్‌సీఆర్‌ఐకి అటాచ్‌గా ఉన్న ఎస్.పి.సుతాన్ ములుగులోని తెలంగాణ ఫారెస్ట్ కాలేజ్ & రీసెర్చ్ లిన్‌స్టిట్యూట్ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్/జాయింట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నాగర్‌క‌ర్నూలు జిల్లా అచ్చంపేట ఎఫ్‌డీవోగా ఉన్న పేట్ల రాజ‌శేఖ‌ర్ ఆదిలాబాద్ డీఎఫ్‌వోగా అదేవిధంగా మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి డివిజ‌న్ ఎఫ్‌డీవో భుక్యా లావ‌ణ్య జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ఎఫ్‌డీవోగా బ‌దిలీ అయ్యారు.

- Advertisement -