హేమచంద్రారెడ్డి హీరోగా ‘ఇద్దరికీ కొత్తేగా’

15
- Advertisement -

కె. హేమ చంద్రారెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై కుల్లపరెడ్డి సురేష్‌బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తేగా’. వసంత పంచమి, ప్రేమికుల రోజును పురస్కరించుకుని బుధవారం ఫిలింనగర్‌ దైవ సన్నిధానంలో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్‌నివ్వగా, సి. కల్యాణ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, కె.ఎల్‌. దామోదర ప్రసాద్‌ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. హైకోర్టు న్యాయమూర్తి శ్వేత, ప్రసన్నకుమార్‌, తమ్మారెడ్డి భరద్వాజ, మాజీ జడ్జి మాల్యాద్రి, మేక మేనక స్క్రిప్ట్‌ను దర్శకుడు సురేష్‌బాబుకు అందించారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ… వకాలత్‌ సినిమాతో హీరోగా మారిన సురేష్‌బాబు ఇప్పుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కె. హేమ చంద్రారెడ్డిని హీరోగా లాంచ్‌ చేస్తున్నారు. మా అందరి సపోర్ట్‌ ఆయనకు ఉంటుంది అన్నారు.

సి. కల్యాణ్‌ మాట్లాడుతూ…తన జీవితన కథనే సినిమాగా మలిచి సురేష్‌బాబు తన దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ‘ఇద్దరికీ కొత్తేగా’ చిత్రం ద్వారా ఆయన కుమారుడు హేమచంద్రారెడ్డిని పరిచయం చేస్తుండడం విశేషం. హేమచంద్రారెడ్డి భవిష్యత్తులో పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…ఒక కొత్త హీరో లాంచ్‌ మూవీకి ఇంతమంది అతిథులు రావడం చాలా అరుదు. సురేష్‌బాబుకు, ఆయన కుమారుడికి నా అభినందనలు అన్నారు.

Also Read:నల్ల ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -