Harishrao:పేదల పక్షానే బీఆర్ఎస్ పోరాటం

10
- Advertisement -

ప్రజా సమస్యలపై గళమెత్తుతూ పేదల పక్షాన నిలుస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీష్…అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ దెబ్బకు సీఎం రేవంత్‌రెడ్డి నేడు ప్రజాభవన్‌ కు వెళ్లాల్సి వచ్చిందన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజల పక్షాన్నే పోరాడాతమన్నారు. ప్రతి రోజు ప్రజాభవన్‌కు వెళ్తానని ప్రగల్బాలు పలికిన సీఎం అధికారంలోకి వచ్చాక తొలిరోజు మాత్రమే వెళ్లారన్నారు.

ఈ విషయంపై బీఆర్ఎస్ నిలదీయడంతో ఇవాళ ప్రజా భవన్‌కు వెళ్లారన్నారు. ఇదే విషయం నిన్ననే ప్రజలకు సమాచారమిస్తే చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చేవారని హరీశ్ రావు తెలిపారు.

Also Read:గ్యాస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి!

- Advertisement -