అంపైర్ కాల్‌పై ఐసీసీ కీలక నిర్ణయం!

310
umpire
- Advertisement -

ఫీల్డ్ అంపైర్ కాల్‌పై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్ ఆట కన్నా దానిలో అంపైరింగ్ తప్పిదాలే ఎక్కువ చర్చనీయాంశంగా మారడంతో అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని ఈ కమిటీ గురువారం సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంది.

డీఆర్ఎస్, అంపైర్ ప్రోటోకాల్స్‌లో 3 మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీఆర్‌ఎస్‌లో అంపైర్ కాల్ కొనసాగుతుందని ప్రకటించిన ఐసీసీ.. ఎల్బీడబ్ల్యూ విషయంలో కూడా వికెట్ జోన్ మార్జిన్‌ను టాప్ ఆఫ్ ది స్టంప్స్‌కు మార్చింది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రివ్యూ ద్వారా ఎల్బీ అవుట్‌ విషయంలో కెప్టెన్‌ కోహ్లీ అంపైర్‌ కాల్‌పై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదంతా గందరగోళంగా ఉందన్నాడు. దీంతో డీఆర్‌ఎస్‌ ద్వారా ఎల్బీపై నిర్ణయం తీసుకునే విషయంలోనూ ఐసీసీ మార్పులు చేసింది.

- Advertisement -