Telangana:భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

12
- Advertisement -

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ  శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా రోనాల్డ్ రోస్ నియమితులయ్యారు. జీహచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆమ్రపాలి నియమితులయ్యారు.

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా శైలాజా రామయ్యర్ నియమితులయ్యారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా నరసింహారెడ్డి, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జీఏడీ సెక్రటరీగా సుదర్శన్ రెడ్డిని నియమించారు.

ఇంత పెద్ద స్థాయిలో ఐఏఎస్ బదిలీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

Also Read:మూవీ రివ్యూ..సందేహం

- Advertisement -