- Advertisement -
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీలో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. సమావేశం అనతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉదని చెప్పారు. మమతాబెనర్జీతో జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి వ్యూహంతో ముందుకు వస్తామని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తన ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. కాసేపట్లో కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. రెండు, మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. 26 లేదా 27న ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ కానున్నారు.
- Advertisement -