కోహ్లీపై మాంటీ పనేసర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

216
virat
- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీపనేసర్. కోహ్లీ అత్యుత్తమ ఆటగాడే అయినా, అతడి సారథ్యంలో భారత్‌ సరిగ్గా ఆడలేకపోతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆల్‌టైమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్‌ కోహ్లీ ఒకడని.. కానీ, అతడి కెప్టెన్సీలో భారత్‌ సరైన ప్రదర్శన చేయడం లేదన్నారు. కోహ్లీ కెప్టెన్సీలో గత నాలుగు టెస్టుల్లోనూ టీమ్‌ఇండియా ఓడిపోవడం చూశామని.. అదేసమయంలో కెప్టెన్‌గా అజింక్య రహానె అద్భుత ప్రదర్శన చేశాడని కితాబిచ్చాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారత్ ఓడిపోతే కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకుంటాడేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు పనేసర్.

ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమిండియా ఓడిపోవడంతో విరాట్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్స్ వస్తున్న నేపథ్యంలో పనేసర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా చివరిసారి టెస్టుల్లో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది.

- Advertisement -