కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్..

114
virat
- Advertisement -

అంతా ఊహించినట్లే టీమిండియా టీ20 క్రికెట్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లకు గుడ్ బై చెప్పాడు విరాట్ కోహ్లీ. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా సోమ‌వారం న‌మీబియాతో జ‌రిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే సెమీస్‌కు మాత్రం చేరలేకపోయింది భారత్.

50 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ…32 మ్యాచ్‌ల‌ను గెలిపించగా 16 మ్యాచ్‌ల‌లో ఓడిపోయింది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఫ‌లితం తేల‌కుండా ఉండిపోయాయి. టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నా.. టెస్టులు, వ‌న్డేల‌కు మాత్రం కోహ్లీనే ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. టీమిండియా టీ20 మ్యాచ్‌ల‌కు ఇక నుంచి కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను రోహిత్ శ‌ర్మ చేప‌డుతాడ‌ని కోహ్లీ న‌మీబియాతో మ్యాచ్‌లో అన్నాడు.

- Advertisement -