సీఎం రేవంత్ సోదరుడికి హైడ్రా నోటీసులు..

7
- Advertisement -

దుర్గం చెరువు FTL పరిధిలో సర్వే నంబర్ 47లో ఉన్న ప్లాట్ నంబర్ 54, 55లలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఉంటున్న సంగతి తెలిసిందే. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఈ ఇంటిని నిర్మించగా తిరుపతిరెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు.

మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి నివాసం ఉండగా ఆ ఇల్లు FTL పరిధిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరో వైపు దుర్గం చెరువును ఆనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. నెలలోగా అక్రమ కట్టడాలు కూల్చేయాలని స్పష్టం చేశారు.

Also Read:TTD:లక్కీడిప్‌లో శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు

- Advertisement -