మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు..!

168
petrol
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ మళ్లీ పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసలు పెంచగా తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.86.65, డీజిల్ ధర లీటర్‌కు రూ.76.83కు చేరింది.

హైదరాబాద్‌లో లీటర్‌ ధర రూ.90.10, డీజిల్‌ రూ.83.81కు చేరగా ముంబైలో పెట్రోల్ రూ.93.20, డీజిల్ రూ.83.73, కోల్‌కతాలో పెట్రోల్ రూ.88.01, డీజిల్ రూ.80.41, చెన్నైలో పెట్రోల్ రూ.89.13, డీజిల్ రూ.82.04కి చేరాయి.

రాయితీ లేని సిలిండర్‌పై రూ.25 ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ పెంచింది.దీంతో దేశ రాజధానిలో ఒక్కో సిలిండర్‌ ధర రూ.719కు చేరింది.

- Advertisement -