టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పై మండిపడ్డారు హైదరాబాద్ ఎంపీ , ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఇటివలే ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పై పలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీపీ అంజనీ కుమార్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు ఒవైసి. అధికారులు పట్ల రాజకీయాల నాయకులు ఈవిధంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.
సీపీపై ఉత్తమ్ వాడిన భాష సరికాదన్నారు. దారుస్సలాం ఏఐఎంఐఎంకు ఓ ముఖ్యమైన వేదిక. ఈ భారీ మైదానంలో గతంలో ఇందిరా గాంధీ కూడా బహిరంగ సభ నిర్వహించారని గుర్తు చేశారు. సీఏఏ ఐ ఆందోళనలు చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇటివలే తాము నిజామాబాద్ లో సీఏఏకు వ్యతిరేకంగా సభ పెడితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వకుండా మా ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించింది అని ట్వీట్ చేశారు.
Congress leader Uttam Kumar’s language against CP Hyderabad is intemperate & should not have been used. He must understand that Darussalam is a large space of AIMIM itself & had once even hosted Indira Gandhi’s public address.
— Asaduddin Owaisi (@asadowaisi) January 1, 2020