రేపు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు

468
Metro
- Advertisement -

నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది మెట్రో సంస్ధ. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైలు నడవనున్నట్లు తెలిపారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మద్యం సేవించిన వారు కూడా మెట్రోలో ప్రయాణించవచ్చని వెల్లడించారు.

తాగి బైక్, కారులలో డ్రైవింగ్ చేయకుండా మెట్రో సేవలను వినియోగించుకోవాలని ప్రయాణికులను కోరారు. అయితే, మద్యం సేవించిన వారు తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. రేపు రాత్రి మెట్రో స్టేషన్లతో పాటు రైలులో కూడా పటిస్టమైన నిఘా వ్యవస్ధ ఉంటుందని తెలిపారు.

- Advertisement -