పెరిగిన బంగారం ధరలు!

238
gold rate
- Advertisement -

కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. దేశీయ మార్కెట్లలో ఇవాళ బంగారం జిగేల్ మంది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరిగి రూ. 49,090కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 260 పెరిగి 53,550కి చేరింది.

బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. కేజీ వెండిపై రూ. 100 తగ్గి రూ.67900కి చేరింది. వెండి ధర తగ్గడం వరుసగా రెండో రోజు కావడం గమనార్హం.

అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గితే దేశీయ మార్కెట్లలో పెరగడం విశేషం. పసిడి ధర ఔన్స్‌కు 0.07 శాతం తగ్గుదలతో 1953 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 27.12 డాలర్లకు చేరింది.

- Advertisement -