రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సీపీ, కలెక్టర్ శరత్

582
cp anjanikumar
- Advertisement -

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నికల నిర్వహణలో పనిచేసిన అధికారులకు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ నుంచి జగిత్యాల కలెక్టర్ శరత్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ లు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తించిన డా. ఏ శరత్ కు జనరల్ క్యాటగిరీలో ఎలక్షన్ మేనేజ్మెంట్ అవార్డు లభించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కి సెక్యూరిటీ మేనేజ్మెంట్ లో స్పెషల్ అవార్డు ఇచ్చారు.

ఈసందర్భంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు అవార్డు లభించడం గర్వంగా ఉంది. ఎన్నికల అధికారులు, పోటీ చేసిన అభ్యర్దుల కృషితోనే సాధ్యమైందన్నారు. తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ఎన్నికలను చక్కగా నిర్వహించామని అన్నారు. సమిష్టి కృషితో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. దేశస్థాయిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలవడం సంతోషకారం అన్నారు.

- Advertisement -