గులాబీమయంగా మారిన హుజుర్ నగర్..

348
cmkcrr
- Advertisement -

ఇవాళ సాయంత్రం హుజుర్ నగర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న నేపధ్యంలో నగరం మొత్తం గులాబీమయంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ జెండాలతో నగరం మొత్తం మెరిసిపోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాకృతజ్ఞత సభ కోసం ప్రజలు భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు.

హుజూర్‌నగర్ అభివృద్ధికి కేసీఆర్ రోడ్‌మ్యాప్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మాత్రమే కాకుండా హైదరాబాద్ నుంచి వందలాది వాహనాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు తరలివెళ్తున్నారు. మధ్యాహ్నం సూర్యాపేటలో టీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. సీఎం సభ కోసం భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు.

- Advertisement -