హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ముగిసిన నామినేషన్ల పర్వం..

108
- Advertisement -

హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తంగా 26 అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేసనట్టు సమాచారం. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజున తమ నామినేషన్లు దాఖలు చేశారు. గెల్లు శ్రీనివాస్ (టీఆర్ఎస్), ఈటల రాజేందర్ (బీజేపీ), బల్మూరి వెంకట్ (కాంగ్రెస్) తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ పత్రాలను ఈ నెల 11న పరిశీలించనున్నారు. ఈ నెల 13వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 30న పోలింగ్, నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

- Advertisement -