హుజురాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.. నోటిఫికేషన్ జారీ..

137
- Advertisement -

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ చేసిన రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈటల రాజీనామా ఆమోదం అనంతరం శాఖాపరమైన చర్యలు చోటుచేసుకున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈటల రాజీనామాపై కేంద్ర ఎన్నికల సంఘానికి శాసనసభ సచివాలయం సమాచారం అందించారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ఎన్నికల సంఘానికి నివేదించారు. త్వరలోనే దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుని ఉపఎన్నిక ప్రకటన చేయనుంది.

ఇవాళ ఈటల తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన వెంటనే పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ కార్యదర్శి వెంటనే ఫైలు రూపొందించి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పంపించగా, ఆయన వెంటనే ఆమోదం తెలిపారు. సాధారణంగా ఓ సభ్యుడు రాజీనామా చేసినప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఆ సభ్యుడితో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈటల స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయడంతో, స్పీకర్ పోచారం నేరుగా ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది.

- Advertisement -