ఎన్నికల ఫలితాలపై రాహుల్‌ గాంధీ షాకింగ్ కామెంట్స్‌..

95
- Advertisement -

5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పట్ల కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల తీర్పును సవినయంగా అంగీకరిస్తున్నామని ఆయన తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో గెలుపొందిన వారికి అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఈ ఎన్నికల కోసం అంకితభావంతో కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ లో 3, పంజాబ్ లో 18, ఉత్తరాఖండ్ లో 18, గోవాలో 12, మణిపూర్ లో 11 స్థానాల్లోనే కాంగ్రెస్ జోరు కనబర్చింది. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నికల ఫలితాలతో పాఠాలు నేర్చుకుంటామని, ప్రజా సంబంధ అంశాలపై పోరాటం కొనసాగిస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వట్టర్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

- Advertisement -