ఉప్పల్ మ్యాచ్‌..టికెట్లకు భారీ డిమాండ్

197
uppal
- Advertisement -

భారత్ – ఆసీస్ మధ్య ఈ నెల 25న మూడో టీ 20 మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఉప్పల్‌ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుండగా టికెట్ల కోసం భారీ డిమాండ్ నెలకొంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్‌ టికెట్లను సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో విక్రయించనున్నారు.

భారీ సంఖ్యలో యువత జింఖానా మైదానం వద్ద టికెట్ల కోసం బారులు తీరారు. ఒక వ్యక్తికి రెండు టికెట్లు మాత్రమే ఇవ్వనుండగా టికెట్ కొనేందుకు వచ్చేవారు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సూచించింది.

టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిలో ఏర్పాటైన హెచ్‌సీఏ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ అభిమానులకు టిక్కెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.

- Advertisement -