కేటీఆర్‌కు జననీరాజనం

305
ktr nalgonda
- Advertisement -

నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ప్రజలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నీరాజనం పట్టారు. నల్లగొండలో వివేకానంద విగ్రహం నుండి క్లాక్ టవర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించగా ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా ప్రజలు చైతన్యం ప్రదర్శించి, కాంగ్రెస్ మహామహులను మట్టికరిపించారని..పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే స్పూర్తిని కనబర్చాలన్నారు కేటీఆర్.

కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు మాత్రమే లాభం. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి మాత్రమే లాభం. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ మొత్తానికి లాభమన్నారు.టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే ఢిల్లీ జుట్టు మన చేతుల్లో ఉంటుందని… ఇద్దరే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని అన్నారు. నాన్‌బీజేపీ..నాన్ కాంగ్రెస్ పార్టీలే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఢిల్లీ దర్బార్‌లో గులాములని కేటీఆర్ ధ్వజమెత్తారు.

ఐదేళ్లలో దేశానికి మోదీ చేసిందేమీలేదని మండిపడ్డారు కేటీఆర్. మోదీ వేడి తగ్గింది..రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. బీజేపీకి 150 సీ,రాహుల్‌గాంధీకి 100 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఈ రోడ్‌షోలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, గుత్తాసుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -